సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆరు నెలల జైలు శిక్షను విధించింది. జైలు శిక్షతో పాటు 15లక్షల 86వేల 550 రూపాయల జరిమానా విధించింది. రూ. 25 లక్షలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఈ శిక్షను విధించింది. వివరాల్లోకి వెళ్తే, 'టెంపర్' సినిమాకు సంబంధించి రచయిత వాసు వేసిన కేసును విచారించిన న్యాయస్థానం ఈ రోజు తీర్పును వెలువరించింది.