పవన్ సినీ రీ ఎంట్రీ దాదాపుగా ఖాయమైపోయినట్టేనని వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాత అంటూ ప్రచారం సాగినా, పవన్ మాత్రం తొలి ఛాన్స్ ఏ.ఎం.రత్నంకే నని చెప్పాడట. ఎందుకంటే గతంలో సినిమా కోసమంటూ రత్నం నుంచి పారితోషికం మొత్తాన్ని సింగిల్ పేమెంట్లో అడ్వాన్సు రూపంలో ఇచ్చేశాడు. ముందు ఆ అడ్వాన్స్ క్లియర్ చేయాల్సిన బాధ్యత పవన్పై ఉందకనుక పవన్ తను ఇచ్చిన మాట నిలుపుకునేలా ఈ అవకాశం ఇచ్చినట్టు సమాచారం క్రిష్ దర్శకంత్వంలో రత్నం నిర్మించే ఈ సినిమాలో పవన్ నటించడం దాదాపుగా ఖాయమైపోయింది. మరోవైపు మైత్రీ మూవీస్ కూడా ఇప్పుడు పవన్తో సినిమా చేయాలని తహతహలాడుతోంది. దిల్ రాజు కూడా రెడీ అంటున్నాడు. ఆ తరవాతే… చరణ్కి ఛాన్సు వస్తుందేమో..? చూడాలి.