“సైరా” నరసింహారెడ్డిని దేశ వ్యాప్తంగా ప్రముఖులకు చూపించే పనిలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి బుధవారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి సినిమా చూడాలని అభ్యర్ధించారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలోనే “సైరా” సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసి ఉపరాష్ట్రపతి కుటుంబంతో కలసి వీక్షించారు. చిరంజీవి నటనని వెంకయ్యనాయుడు భళారే... అన్నట్టు తెలుస్తోంది.