తెలుగు చిత్ర పరిశ్రమలో గోపికృష్ణా మూవీస్ బ్యానర్ ది ప్రత్యేక స్థానం. అలాంటి గోపికృష్ణా మూవీస్ బ్యానర్ లో సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్రిభాషా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్న సంగతి తెలిసిందే. గోపికృష్ణా మూవీస్ బ్యానర్, యువీ క్రియేషన్స్ తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. జిల్ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అందించిన కే కే రాధాకృష్ణ దర్శకుడు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం భారీ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. దీనికోసం భారీ సెట్ వేస్తున్నారు. ఈ సెట్లో జరిగే షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు ముఖ్య తారాగణం పాల్గొంటారు. రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేశారు.