కీర్తి సురేష్ తదుపరి చిత్రం మిస్ ఇండియాపై అటు తెలుగు, ఇటు తమిళ పరిశ్రమలలో చాలా అంచనాలే ఉన్నాయి. తొలి దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలో కీర్తి సరికొత్త గెటప్లో కనిపించనుందట. ఇప్పటికి 10 రకాల గెటప్స్ వేసి చూసారని, తన పాత్రకు తగిన గెటప్ వచ్చేవరకు వదిలేది లేదంటున్నదట మహానటి.
ఇదే అంశాన్ని దర్శకుడు నరేంద్ర నాథ్ మీడియాకు చెపుతూ నిజాయితీగా, అప్రయత్నంగా పాత్రలోకి జారిపోయే నేర్పు ఆమె నైజం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె పాత్ర లోకి ప్రవేశించగానే దాని భావోద్వేగాలను అందుకుంటుంది, త్వరగా అర్థం చేసుకుని తదనుగుణంగా నటిస్తుంది. అందుకు తగిన రూపాన్ని ఖరారు చేయడానికి ఆమె చాలా ఓపికగా చూస్తోంది. 50 గెటప్స్ అయినా వేసి, సంతృప్తి పొందాకే షూటింగ్కి సిద్దం అవుతానని చెప్పిందట కీర్తి.
మరోవైపు కీర్తి సురేష్ మైదాన్ తో బాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. బోనీ కపూర్, ఆకాష్ చావ్లా మరియు అరుణవ జాయ్ సేన్గుప్తా సంయుక్తంగా ఆయా బ్యానర్లలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా ఆమె అజయ్ దేవ్గన్ సరసన నటిస్తుంది. ఇప్పటికే కీర్తి సురేష్ మొదటి షెడ్యూల్ లో తన భాగాల షూటింగ్ పూర్తి చేసారు మరియు రెండవ షెడ్యూల్ కురడీ అవుతోంది.
ఇక కార్తీక్ సుబ్బరాజ్ స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ నిర్మించిన పెంగ్విన్ బహుళ భాషా చిత్రం రడీ అవుతోంది. దీంతో పాటు మళయాళంలో దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో వస్తున్న అరబికడలింటే సింహామ్ చిత్రంలో మోహన్ లాల్ సరసన నటిస్తోంది. నిర్మాత బోనీ కపూర్ హెచ్ వినోత్ దర్శకత్వంలో అజిత్ కుమార్ కొత్త చిత్రం వాలిమై కోసం కీర్తి సురేష్ ను కలసి కథ వినిపించగా ఓకే చెప్పడంతో దీని రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా పలు సినిమాలలో నటించే వరుస ఛాన్సులందుకొంటోంది మహానటి అన్న ప్రశంసలు వినవస్తున్నాయి.