చిరంజీవి, కొరటాల శివల కాంబినేషన్లో రానున్న సినిమా వచ్చే నెలలోనే సెట్స్ మీదికి వెళ్లి సందడి చేయనుంది. ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. . సినిమాకు సంబంధించిన టెక్నిషన్స్ అందరి పేర్లు ప్రకటించినా మ్యూజిక్ డైరెక్టర్ పేరు బయటపెట్టలేదు. దీంతో సంగీత దర్శకుడు ఎవరా? అన్న మీమాంస నెలకొందన్న మాట ఫిలింనగర్లో షికార్లు చేసింది.
ఇప్పటి వరకు దేవి శ్రీ ప్రసాద్ చేత మ్యూజిక్ చేయించుకున్న కొరటాల తాజాగా బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్, అతుల్ లను తీసుకున్నారన్న వార్తల పట్ల మెగా అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే ఇటీవల విడుదలైన చిరంజీవి సైరాకు ఇద్దరు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసినందు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మన నేటివిటీ మిస్ అయ్యిందన్నది వారి మాట.
ఇప్పుడు కూడా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకోవడం తమకు రుచించడం లేదన్నది ఫ్యాన్స్ చెపుతున్న మాట . కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా విడుదల చెయ్యనున్నారని ప్రచారం జరుగుతుంది.