విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురం బుజ్జి దర్శకత్వంలో నటిస్తున్నాడు. బన్నివాసు నిర్మాతగా జిఏ2 బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రోమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.
తాజా సమాచారం మేరకు ఈ చిత్రానికి ‘గీత గోవిందం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి మణికంఠన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా గోపిసుందర్ సంగీత దర్శకుడు. లవ్ స్టోరీస్ ను తెరకెక్కించడంలో పరుశురం కు మంచి పేరు ఉంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మంచి విజయం సాదిస్తాడని ఆశిద్దాం.