శివ జొన్నల గడ్డ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘రుద్రనాగు’చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఫిలిం చాంబర్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు, ఏపీ ఎఫ్.డి.సి చైర్మన్ విజయ్చందర్ క్లాప్నివ్వగా సారిపల్లి కొండల రావు కెమెరా స్విచాన్ చేశారు. సీనియర్ దర్శకుడు వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల , లయన్ సాయి వెంకట్ తదితరులు విచ్చేశారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సర్వేశ్వర మూవీస్ పతాకంపై గుద్దేటి బసవప్పమేరు నిర్మిస్తుండగా,.రాజేందర్ , రమేష్ కడూరి (ఆర్కె), బి.లక్ష్మి, రంగసాయి టి.వి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రంలో శివ సరసన సుప్రియ , శివలీల హీరోయిన్స్గా నటిస్తున్నారు.