నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగా ఎంతోమందికి చేరువయ్యారు. ఇక జబర్థస్త్ షోలో నాగబాబు నవ్వుల కోసమే ఈ షో చూసే వాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ షోతో మెగా బ్రదర్.. స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రామ్ ఎంత పాపులర్ అయిందో సెపరేట్గా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా జబర్ధస్త్ షో అంటే కామెడీతో పాటు రోజా, నాగబాబు నవ్వులతో నపాటు వాళ్లు జడ్జ్మెంట్. ఇక సార్వత్రిక ఎన్నికల వేళ నాగబాబు, రోజా జబర్ధస్త్ ప్రోగ్రామ్కు కాస్త విరామిచ్చారు. నాగబాబు.. తన తమ్ముడు జనసేన తరుపున నర్సాపురం ఎంపీగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో నాగబాబు విజయం సాధించలేదు. దీంతో యదావిధిగా జబర్ధస్త్ జడ్జ్గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఐనా.. రాజకీయాలే తన ప్రాధాన్యం అని చెప్పుకున్నారు. తాజాగా నాగబాబు...ఈ టీవీలో ప్రసారమయ్యే ఈ షో నుంచి పక్కకు తప్పుకొని జీ తెలుగులో ప్రసారమయ్యే కొత్త షోతో తన కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నాడు. ఈ షో కోసం జబర్ధస్త్ షో నుంచి మూడు నాలుగు టీమ్స్ను జీ తెలుగుకు తీసుకెళ్లారు. దానికి సంబంధించిన ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ షోలో నాగబాబు ప్లేస్ను సాయి కుమార్, ఆలీ, బండ్ల గణేష్లతో రీప్లేస్ చేయాలనే ఆలోచనలో జబర్ధస్త్ షో నిర్వాహకులు ఉన్నారని సమాచారం. ముఖ్యంగా గురువారం ప్రసారమయ్యే కామెడీ షోకు సాయి కుమార్ను, శుక్రవారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్కు ఆలీని అనుకుంటున్నారు. వీళ్లిద్దరితో పాటు బండ్ల గణేష్ను కూడా సైడ్ ట్రాక్లో పెట్టారు జబర్ధస్త్ షో నిర్వాహకులు. వీళ్లిద్దరిలో ఎవరైన రాకపోతే.. వాళ్ల ప్లేస్ను బండ్ల గణేష్తో రీప్లేస్ చేయాలనే ఆలోచనలో జబర్ధస్త్ షో నిర్వాహకులు ఉన్నారు. ఇప్పటికే సాయి కుమార్ ఈటీవీలో ప్రసారమయ్యేు పలు రియాల్టీ షోలకు యాంకర్గా నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆలీ కూడా ఆలీతో జాలీగా వంటి ఇంటర్వ్యూలతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులతో అతనికి కూడా పరిచయం ఉంది. ఇక ఇప్పటి వరకు టీవీ ప్రేక్షకులతో సంబంధం లేని బండ్ల గణేష్ ఈ ప్రోగ్రామ్ను ఎలా రన్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏమైనా నాగబాబు లేని జబర్దస్త్ షోను ఈ ముగ్గురు తమదైన జడ్జిమెంట్తో ఎలా ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి.