రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో చేస్తోన్న భారీ మల్టీస్టారర్ పై ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్కు జోడిగా ఆలియా భట్ నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్కు జోడిగా హాలీవుడ్ బ్యూటీ డైసీ ఎడ్గర్ను ఎంపిక చేసారు. అనుకోని కారణాలతో ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంది.దాంతో ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా ఎవరు నటిస్తారనే విషయమై క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా ఎవరు నటిస్తారనే విషయం మరికాసేట్లో చిత్ర యూనిట్ అఫీషియల్గా ప్రకటించనుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా మరోసారి అమెరికన్ అమ్మాయినే తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ పాత్రకు పక్కా ఫారెన్ బ్యూటీ కావాలి కాబట్టి మరో ఆఫ్షన్ లేక ఇప్పుడు హాలీవుడ్ బ్యూటీని తీసుకున్నాడని తెలుస్తుంది. ఆ అమ్మాయి పేరు ఎమ్మా రాబర్ట్స్ అని తెలుస్తున్నా కూడా కాదు మరో ముద్దుగుమ్మను ఎంచుకున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మా అయినా కాకపోయినా కచ్చితంగా ఎన్టీఆర్ జోడీ మాత్రం మరోసారి తెల్లమ్మాయే అనేది మాత్రం పక్కా.లేకపోతే ఇక్కడి హీరోయిన్స్ను ఎవరినైనా తీసుకుంటారా అనేది చూడాలి. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్లతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చే యేడాది జూలై 30న విడుదల చేయాలని ఆల్రెడీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్స్ బాగా రాకపోవడంతో ఈ సినిమాలో కొన్నీ సీన్స్ రీ షూట్ చేయాల్సింది ఉందట. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ గాయాలతో ఈ సినిమా షెడ్యూల్ అనుకున్న సమయానికంటే కాస్తా లేటయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈ సినిమాను 2021కి వాయిదా పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.