ఒకవైపు తెలుగు, తమిళం, మరోవైపు హిందీ సినిమాలతో పుల్లు బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమాతో ఎక్స్ప్రెస్ వేగంతో దూసుకొచ్చిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో ఉన్న అగ్ర కథానాయకులందరితో నటించి కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాప్ హీరోయిన్గా టాలీవుడ్, కోలీవుడ్లో ఆమె కంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. ఐతే.. కెరీర్ ప్రారంభంలో రకుల్ ప్రీత్ సింగ్కు ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఒదులుకుందట. అది కూడా సరైన అవగాహన లేకుండా ఇదంత జరింగిందంటోంది. అప్పట్లో ఈ చిత్రంలో తాప్సీ ప్లేస్లో రకుల్ నే తీసుకున్నారు. మూడు నాలుగు రోజులు కూడా షూటింగ్లో పాల్గొంది. ఐతే.. అప్పట్లో మిస్ ఇండియా కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకు సినిమాలు అడ్డుగా వస్తున్నాయని భావించి ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నట్టు వివరించింది. అప్పట్లో సినిమా రంగం తనకు సరైన రంగం కాదనుకోవడం వల్ల ఇదంత జరిగిందన్నారు. అంతా కుదిరితే.. ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతోనే టాలీవుడ్కు పరిచయం అయ్యాదాన్ననని రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. ఏమైనా ఎప్పిటికైనా.. ప్రభాస్తో కలిసి నటించడం తన కల అంటోంది ఈ భామ.