ఒకప్పుడు కామెడీతో అలరించిన గుండు హనుమంతరావు, పొట్టి వీరయ్యలు ఇప్పుడు కష్టాలలో ఉన్నారు . గుండు హనుమంతురావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, ఈ మధ్య ఓ కార్యక్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరించాడు. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవికి తెలియడంతో వెంటనే 2లక్షల రూపాయల చెక్ ను ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా ద్వారా అందజేశారు.‘మా’ జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, ఎగ్యిక్యూటివ్ మెంబర్ సురేష్ స్వయంగా అపోలో అసుపత్రిలో చికిత్స పొందుతున్న గుండు హనుమంతరావు దగ్గరికి వెళ్లి చెక్ అందించారు. అనంతరం గుండు హనుమంతురావు తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా చిరంజీవి గారితో కాసేపు ఫోన్ లో ఉత్సాహంగా మాట్లాడారు. అలాగే మరో కమెడియన్ పొట్టి వీరయ్య ఆర్ధిక పరిస్థితులను చిరంజీవి సతీమణి సురేఖ పేపర్లో చదివి చలించిపోయారు. తమవంతు సహాయంగా వీరయ్య కుటుంబానికి కూడా 2లక్షల రూపాయలు సహాయం చేసారు. వీరయ్య ను ‘మా’ ఆఫీస్ కు పిలిపించి శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్ చేతుల మీదుగా 2లక్షల చెక్ ను అందించారు.