‘ఖైదీ’ లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకున్నయాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై దృశ్యం ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దొంగ’. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల వుతున్నఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు.
హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ మాట్లాడుతూ – “ఖైదీ’ లాంటి సూపర్ హిట్ తర్వాత కార్తీ చేస్తోన్న డిఫరెంట్ కమర్షియల్ ఫిలిం ‘దొంగ’. యాక్షన్, ఎమోషన్ అన్ని ఉన్నఈ చిత్రం టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్ వస్తోంది.మా బేనర్లో తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం కల్పించిన వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ సంస్థలకి, హీరో కార్తీ గారికి ధన్యవాదాలు. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్గా విడుదలచేస్తున్నాం“అన్నారు.