తాజాగా పోలీస్ ఎన్కౌంటర్ లో దిశను హత్య చేసిన నిందితులు చావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాగా.. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును చటాన్పల్లికి వ్యాన్లో తీసుకెళ్లగా వారు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రియాంకరెడ్డి నిందితుల ఎన్కౌంటర్పై సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంకరెడ్డికి సరైన న్యాయం జరిగిందంటూ ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ ఎన్కౌంటర్పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. ప్రియాంకరెడ్డి హ్యతకేసు నిందితులని ఎన్కౌంటర్ చేయడం పట్ల పూరీ జగన్నాథ్ స్పందించారు. “సెల్యూట్.. తెలంగాణ పోలీస్ డిపార్టుమెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరే మా రియల్ హీరోస్… నేనెప్పుడు ఒక విషయాన్ని నమ్ముతాను. మనకి కష్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు. నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే” అంటూ పూరీ తన ట్వీట్లో పేర్కొన్నాడు. “ప్రియాంకరెడ్డికు న్యాయం చేయడం ఇక్కడ ఆగొద్దు . బాల్యం నుండి విద్య, సాధికారత మరియు జ్ఞానోదయం ద్వారా ఇటువంటి ఘోరమైన నేరాలను నిరోదించాలి. జైహింద్. ఇప్పుడు ప్రియాంకరెడ్డి ఆత్మ శాంతిస్తుంది” అని రవితేజ తన ట్వీట్లో పేర్కొన్నారు.