లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటించాలని చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటికే సౌత్ లో నయనతార, అనుష్క శెట్టి, త్రిష, అమలాపాల్ ఇలా చాలా మంది హీరోయిన్లు కమర్షియల్ చిత్రాలతో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తు ప్రేక్షకుల మన్నలను పొందుతున్నారు.గతంలో బాలీవుడ్ లోనూ ఈ తరహా ట్రెండ్ ఉన్న కొంత ఊపు తగ్గింది. అయితే తాజాగా క్రేజీ హీరోయిన్ రాణి ముఖర్జీ గోపి పుత్రన్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'మర్ధానీ 2'. డిసెంబర్ 13న విడుదల కానుంది.
ఈ చిత్రంలో ఓ సైకో అమ్మాయిలపై అత్యాచారం చేసి, హత్య చేసే కేసుని చేధించే పోలీస్ అధికారిగా రాణి ముఖర్జీ నటించడం విశేషంకాగా, ఇప్పుడు రాణి ముఖర్జీ ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. ఇందుకోసం ముంబై వీధుల్లో తిరుగుతూ వివిధ ప్రాంతాల్లోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులని కలుసుకుంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజల సేఫ్టీ కోసం ఎలాంటి జాగ్రత్తలపై అడిగి తెలుసుకుంది.
ఈ చిత్ర ప్రచారంలో భాగంగా రాణి ముఖర్జీ తను చేపట్టిన ఈ ఆసక్తికరమైన కార్యక్రమం గురించి మీడియాలో మాట్లాడుతూ నేరాలని అరికట్టడంలో ట్రాఫిక్ పోలీసులు ప్రధాన పాత్ర వహిస్తుంటారు ఈ క్రమంలోనే మహిళా ట్రాఫిక్ పోలీసులని ఎక్కువగా కలుసుకుని, వారు శిక్షణ పొందిన తీరు, విధుల నిర్వహణలపై అడిగి తెలుసుకున్నట్లు తెలిపింది. నేడు వారిని కలుసుకోవడం, వివిధ అంశాల గురించి చర్చించడం జరిగిందని చెప్పింది.
మర్ధానీ 2 చిత్రం గురించి మాట్లాడుతూ మీరు ఖచ్చితంగా సీట్ల అంచుకు కూర్చుని చూసేలా ఉత్కంఠ రేకెత్తిస్తుందని తెలిపింది