మహేష్ బాబు హీరోగా రష్మిక కథానాయికగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. విజయశాంతి ముఖ్య పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, ఈ టీజర్ ప్రేక్షకులలో మూవీపై అంచనాలు పెంచింది. దేవి శ్రీ సంగీతం కూడా ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుందని పోస్టర్లో తెలిపారు. ఆ రోజు బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురవడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. ఇక చిత్రానికి సంబంధించి ప్రతి సోమవారం సాంగ్ విడుదల చేస్తుండగా, ఈ సోమవారం హీ ఈజ్ సో క్యూట్ అనే సాంగ్ విడుదల కానుంది. ఈ సాంగ్కి సంబంధించి రష్మిక టిక్ టాక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే.