ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ: రాజ్‌తరుణ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2019, 06:11 PM



`ఇద్దరి లోకం ఒకటే` మూవీ క్రిస్మస్‌ సందర్భంగా సినిమాను డిసెంబర్‌ 25న విడుదల చేస్తున్నారు. రాజ్‌తరుణ్ హీరోగా జీఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రేమకథా చిత్రం `ఇద్దరి లోకం ఒకటే`. స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ నిర్మాతగా రూపొందుతున్న చిత్రమిది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ తన సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ``టర్కీష్ సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని `ఇద్దరి లోకం ఒకటే` సినిమాను రూపొందించారు. నేను మాతృకలో సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. తర్వాత స్క్రిప్ట్ విన్నాను. ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. ఇందులో నా పాత్ర సెటిల్డ్‌గా ఉంటుంది. షాలిని పాండే చాలా అద్భుతంగా నటించింది`` అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com