ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయం అన్నది వేడిగా ఉన్నప్పుడే వ‌డ్డించాలి!

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2019, 08:22 PM



ఈ మాట అన్నది కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార. దేనిమీదనైనా చాలా తక్కువగా మాట్లాడే నయనతార ప్రియాంక‌రెడ్డి సంఘటన మీద మాత్రం తీవ్రంగానే స్పందించారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై నయనతార వెరైటీగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ఏ రైట్ యాక్ట్ ఆఫ్ హ్యుమానిటీ అంటూ రాసిన లేఖ సామాన్యులకు బాగా నచ్చేసింది. న్యాయం అన్నది వేడిగా ఉన్నప్పుడే వడ్డించాలంటూ తనదైన శైలిలో స్పందించారు. ఒక అమాయకురాలిని అంత దారుణంగా చంపినవాళ్లను అంతకంటే దారుణంగా చంపేసినా తప్పేంలేదని స్పష్టం చేశారు. సరైన సమయంలో సరైన న్యాయం చేసిన తెలంగాణ పోలీసులు నిజమైన హీరోలని.. వారికి తన సలాం అనీ అన్నారు. ఈ లేఖ నయనతార అభిమానులనే కాదు, సామాన్యులను బాగా ఆకట్టుకుంటోంది. నెటిజన్లు ఆమెను ఓ రేంజ్‌లో అభినందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com