విష్ణు మంచు హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. వేగంగా చిత్రీకరణ జరుగుతోం ది. ఇందులో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. విష్ణు, సునీల్ మధ్య భారీ యాక్షన్ పార్ట్ సీన్స్ చిత్రీక రిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ నిపుణుల ఆధ్వర్యంలో ఈ చిత్రీకరణ జరుగుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇందుకొ సం రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేశారు. ఇంత వరకు తెలుగులో రానటువంటి విధంగా ఈ యాక్షన్ సీన్స్ ఉంటాయని యూనిట్ అంటోంది. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. మోఈ చిత్రంలో ఇంకా కాజల్ అగర్వాల్, నవదీప్, నవీన్ చంద్ర, రుహీ సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: షెల్డన్ చౌ, నిర్మాత: విష్ణు మంచు, దర్శకత్వం: జెప్రీ గీ చిన్.