ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైజాంలో వసూళ్ల రికార్డులో ‘సరిలేరు నీకెవ్వరు’

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 20, 2020, 02:35 PM



సంక్రాంతి  కానుకగా  వచ్చిన  ‘సరిలేరు నీకెవ్వరు’  చిత్రం  తెలుగు  రాష్ట్రాల్లో  రికార్డు  స్థాయి  వసూళ్లను  రాబడుతూ  దూసుకుపోతోంది. ముఖ్యంగా  నైజామ్ లో  ఈ  చిత్రం   తన సత్తా  చాటుతోంది. నిన్న  ఒక్కరోజే  ఈ  సినిమా  ఇక్కడ  రూ. రెండు  కోట్లకి  పైగా  షేర్  సాధించడం విశేషం. దాంతో  ఇంతవరకూ  ఈ  సినిమా  ఇక్కడ  32.1 కోట్ల  షేర్ ను  సాధించింది. గతంలో   ‘మహర్షి’   సినిమా   ఇక్కడ రూ. 30 కోట్ల షేర్ ను వసూలు  చేసింది. అంతకు మించిన  వసూళ్లతో  ‘మహర్షి’  రికార్డును  ‘సరిలేరు నీకెవ్వరు’  అధిగమించింది. నైజామ్ లో ఈ సినిమా 35 కోట్లకి పైగా షేర్ ను సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు..రష్మిక మందన నటించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com