నాగశౌర్య తాజా చిత్రం 'అశ్వద్థామ'. మెహ్రీన్ కథానాయిక. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహించారు. విశాఖలో జరిగే నేరాల నేపథ్యంలో నడిచే ఓ థ్రిల్లర్ కథతో అశ్వద్థామ తెరకెక్కింది. ఈ నెల 31న అశ్వద్థామ ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవ హీరో నాగ శౌర్య రాసుకున్న కథ ఆధారంగా తెరకెక్కిన 'అశ్వద్ధామ' మూవీ టీజర్ ను ఇటీవల సమంత విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. గురువారం ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ అదిరిపోయింది. సస్పెన్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఫర్ ఫెక్ట్ ప్యాకెజ్ లా ఉంది. దీంతో సినిమాపై నమ్మకం పెరిగింది. బయ్యర్లకు ఓ ధీమా లభించింది. అశ్వథ్ధామ ట్రయిలర్ బయటకు రావడంతో ఇప్పటి దాకా కేవలం డిస్కషన్స్ లో వున్న బిజినెస్ ఒక్క రోజులో ఊపు అందుకుంది. వైజాగ్, ఈస్ట్, సీడెడ్ ఇలా ఒక్కో ఏరియా కేవలం ఒక్క రోజులో క్లోజ్ చేసారు. అలాగే హిందీ డిజిటల్ కూడా క్లోజ్ చేసేసారు. మొత్తానికి ట్రైలర్ అశ్వద్థామ రేంజ్ ని పెంచేసింది. సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటే హిట్టు పడినట్టే.