పవన్ కళ్యాణ్ జనవరి 20 నుండి పింక్ రీమేక్ చేస్తున్నాడు అని మూవీ టీం కానీ, దిల్ రాజు కానీ చెప్పకుండానే పవన్ లాయర్ గెటప్ లో వున్న ఫోటో లీకైంది. దానితో పవన్ ఫాన్స్ ఆనందంతో.. ఆ పిక్ ని వైరల్ చేసి పడేశారు. మళ్ళీ సినిమాలు చేస్తున్నాడంటూ రాజకీయ నేతలు తనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారని పవన్ సైలెంట్ గా పింక్ రీమేక్ పూర్తి చేద్దామనుకుంటే.. ఇక్కడ లీకైన పిక్ తో పవన్ సినిమాలు చేసుకుంటాడు డబ్బు సంపాదిస్తున్నాడు.. ఇక అమరావతి ప్రజలకేం న్యాయం చేస్తాడంటూ రాజకీయ నాయకులు గొడవ చేస్తుండడంతో.... పవన్ కి కోపం వచ్చి నిర్మాత దిల్ రాజుని పిలిచి సెట్స్లోని ఫొటోలు లీక్ అవడంపై ఫైర్ అయ్యాడట. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనందుకు నిర్మాతలపై మండిపడినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.