రుక్మిణి, ఈశ్వర్, నిన్నే ఇష్టపడ్డాను, పెళ్లి కాని ప్రసాద్, వీర తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి శ్రీదేవి. రాహుల్ ని వివాహం చేసుకున్న శ్రీదేవి కి గత ఏడాది జూలైలో రూపిక అనే బేబి గార్ల్ జన్మించింది. రీసెంట్ గా ఆ బేబి మొదటి జన్మదిన వేడుకలని గ్రాండ్ గా నిర్వహించారు వారి కుటుంబ సభ్యులు. అర్జున్, సిద్ధార్ద్, రమ్య కృష్ణ, ఐశ్వర్య ధనుష్ వంటి సెలబ్రిటీలు ఈ బర్త్ డే వేడుకకి హాజరయ్యారు. గత ఏడాది రూపిక క్రాడిల్ సెర్మనీ హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిపిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకి పలువురు సినీ తారలు హాజరయ్యారు