క్యాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది నటి శ్రీరెడ్డి. సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారి సోషల్ మీడియా వేదికగా పలువురిపై ఆరోపణలు చేస్తుంది. ఇటీవల కరాటే కళ్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేష్ పైన బూతులతో రెచ్చిపోయిన శ్రీ రెడ్డి మరోసారి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు అభిరామ్ గురించి మాట్లాడి అందరికి షాక్ ఇచ్చింది. సురేష్ బాబు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా లోని రామానాయుడు స్టూడియోను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి అమ్మేశారని పలు వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ లోని స్టూడియోను అమ్మేసి వైజాగ్ లో ఉన్న స్టూడియోను అభివృద్ధి చేయాలని సురేష్ బాబు చూస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా శ్రీ రెడ్డి స్పందించింది. ఎక్కడైతే నాకు అభిరామ్ కు ఫస్ట్ నైట్ అయ్యిందో ఆ స్టూడియోను త్వరలో కూల్చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ పై పలువురు స్పందిటున్నారు.