రానా, సాయి పల్లవి నటిస్తున్న తాజా మూవీ విరాట పర్వం… ఈ మూవీ షూటింగ్ గత ఏడాది జూన్ లోనే ప్రారంభమైంది.. అయితే ఆ తర్వాత ఈ మూవీ నుంచి ఎటువంటి అప్ డేట్స్ లేకపోవడంతో ఈ మూవీ ఆగిపోయిందని అందరూ అనుకున్నారు.. తాజాగా ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా జరిగిపోతున్నది..ఇప్పటికే సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.. ఈ మూవీలో బాలీవుడ్ నటి నందితా దాస్ ఒక కీలకపాత్రలో కనిపించనుంది.. ప్రస్తుతం ఆమె సీన్స్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో షూట్ చేస్తున్నారు.. ఆ సెట్ లోని ఫోటోలను నందితా స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తొలిసారిగా తెలుగు మూవీలో నటించడం ఎంతో అనందంగా ఉందంటూ టాలీవుడ్ పై ప్రశంసలు కురిపించింది.. ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.. పీరియాడిక్ సోషల్ డ్రామాగా 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు..