వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘భీష్మ’. ఈ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుది. ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో నేడు భీష్మ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా గల ఈ చిత్ర ట్రైలర్ సరికొత్తగా ఉంది. భీష్మలో నితిన్ రష్మిక ల రొమాంటిక్ ట్రాక్ తో పాటు, సోషల్ మెస్సేజ్ కూడా ఉందని అర్థం అవుతుంది. లాభాపేక్షలతో కృత్రిమ ఎరువులు, రసాయనాలు వాడి హెబ్రీడ్ పంటలు పండించడం వలన ప్రజారోగ్యానికి ఎంత హాని జరుగుతుంది అనేది చెప్పినట్లు ఉన్నారు. అయితే 'భీష్మ' ఫిబ్రవరి 21 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బిజినెస్ పూర్తయినట్లు సమాచారం. ఈ చిత్ర ఆంధ్ర రైట్స్ ఏడు నుంచి ఎనిమిది కోట్ల రేషియోలో అమ్మేశారని తెలుస్తుంది. నాలుగున్నర కోట్ల కు నైజాం రైట్స్ , రెండు కోట్లకు పైగా సీడెడ్ రైట్స్ అమ్మేసారట. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 14 నుంచి 15 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది. కర్ణాటక, ఓవర్ సీస్, తమిళనాడు ఇలా చిన్నా, పెద్దా అన్నీ కలుపుకుంటే ఇరవై కోట్ల వరకు థియేటర్ రైట్స్ నుంచి వచ్చాయి. మొత్తం మీద భీష్మ కు గట్టిగానే బిజినెస్ జరిగినట్లు సమాచారం. మణిశర్మ తనయుడు సాగర్ మ్యూజిక్ అందించగా సితార బ్యానర్ పు నాగ వంశీ నిర్మించారు.