పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ తో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే కీలక సిన్నవేశాలను షూట్ చేసిన పవన్ కళ్యాణ్ పై ఒక పవర్ ఫుల్ ఫైట్ను చిత్రీకరించారట. సినిమా కూడా ఈ ఫైట్ మీదే ఓపెన్ అవుతుందట. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడనున్న తొలి సీన్ ఫైట్ కావడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే విషయమే. అలాగే ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. పవన్ మరో సినిమా క్రిష్ తో తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వేణు శ్రీరామ్ మరియు క్రిష్ లతో చేస్తోన్న సినిమాలలోని కొన్ని ఎపిసోడ్స్ షూట్ లో కూడా పవన్ పాల్గొన్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొఘల్ సామ్రాజ్యం నాటి పరిస్థితుల నేపథ్యంలో కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఏ.ఎం. రత్నం అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్లని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్కు జోడీగా ఇద్దరు కథానాయికలు లేదా ముగ్గురు నటించే అవకాశం వుందని తెలిసింది. ఇప్పటి వరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రగ్యా జైస్వాల్ల పేర్లు వినిపించాయి. తాజాగా భూమిక పేరు చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై దర్శకుడు క్రిష్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే. `ఖుషి` చిత్రంతో పవన్, భూమిక కలిసి నటించిన విషయం తెలిసిందే.