ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వైయస్ఆర్సీపీ నాయకురాలు, సినీ నటి జయసుధ కలిశారు. తాడేపల్లి నివాసంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలిసి తన కుమారుని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా జయసుధా, ఆమె తనయుడితో సీఎం వైయస్ జగన్ ఆప్యాయంగా మాట్లాడారు.
టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్ బాబు.. రామ్ చరణ్.. ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి ముగ్గురు పలు అకేషన్స్ లో కలవడం.. కలిసి ఫొటోలకు ఫోజ్ లు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ హీరోల్లో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటూ గతంలో మహేష్ బాబును అడగగా ఎన్టీఆర్.. చరణ్ పేర్లు చెప్పాడు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్.. చరణ్ పై తనకున్న ఇష్టంను మహేష్ బాబు చెప్పకనే చెప్పాడు.