బాలీవుడ్ టు టాలీవుడ్ అంతా సుపరిచితం కియారా అద్వానీ. బ్యూటిఫుల్ హీరోయిన్గా యువ హృదయాలను దోచేసిన ఈ భామకు అవకాశాలకు కొదవేం లేదు. మరోవైపు సోషల్ మీడియా లోనూ హావా కొనసాగిస్తూ ఆన్లైన్ వేదికలను వేడెక్కిస్తోంది. అమాంతం తన ఫాలోయింగ్ పెంచుకుంటూ తన మార్క్ కనిపించేలా హాట్ పిక్స్ షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ న్యూడ్ పిక్ షేర్ చేసి సడెన్ షాక్ ఇచ్చింది కియారా. వివరాల్లోకి పోతే. మొదట బాలీవుడ్ సినిమాతోనే తెరంగేట్రం చేసిన కియారా అద్వానీ.. ఇటీవలే తెలుగు తెరపై కాలుమోపి మహేష్ బాబు, రామ్ చరణ్లతో రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. తిరిగి బాలీవుడ్ వెళ్లిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందం, అభినయం రెండూ పుష్కలంగా ఉండటంతో కియారాకు వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి.
టాలీవుడ్లో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమా, రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' అనే సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్ లో జెండా పాతింది కియారా. అక్కడ వరుస కమిట్మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటోంది కియారా. నెట్టింట హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యూత్ ఆడియన్స్కి కిక్కు మీద కిక్కు ఇస్తోంది.బాలీవుడ్లో గతేడాది 'కబీర్ సింగ్' సినిమాతో సక్సెస్ సాధించి ఆ తర్వాత అక్షయ్ కుమార్తో చేసిన ‘గుడ్ న్యూస్'తో మరో హిట్ పట్టేసి బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది కియారా. ప్రస్తుతం ఈ అమ్మడు అదే అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లక్ష్మీబాంబ్' అనే ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది.ఓ వైపు వెండితెర ప్రయాణం చేస్తూనే.. 'లస్ట్ స్టోరీస్' రూపంలో వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ని షేక్ చేసింది కియారా. ఈ వెబ్ సిరీస్లో స్వయం తృప్తి పొందే మహిళగా నటించి యువతకు పిచ్చెక్కించింది. దీంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఇకపోతే తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ షాకింగ్ పిక్ షేర్ చేసి వార్తల్లో నిలిచింది కియారా అద్వానీ. ఒంటి మీద నూలు పోగులేకుండా, కేవలం ఆకు చాటున అందాలను దాచి స్పెషల్ కిక్కిచ్చింది కియారా. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.