ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా భార్య డిస్టర్బ్ అయింది -ఛార్మీ డాడీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 19, 2017, 12:58 PM



డ్రగ్స్ ఉదంతంతో టాలీవుడ్ షేక్ అయిపోతోంది. కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. పైగా ఇవాల్టి నుంచే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. నోటీసులు పంపిన వ్యక్తులను విచారించడం ప్రారంభించనుంది. తొలుత పూరీ జగన్నాథ్ తో ఈ విచారణ కానుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ కేసులో మాజీ హీరోయిన్ ఛార్మి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మీడియాలో ఆమెపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇదంతా తమ ఫ్యామిలీని ఎంతో ఇబ్బంది పెడుతోందని చెబుతున్నారు ఛార్మి తండ్రి దీప్ సింగ్ ఉప్పల్.'ఈ ఆరోపణలపై స్పందించేందుకు నా కూతురు టైం కేటాయించడం లేదు. నాకు నా కూతురు గురించి బాగా తెలుసు. తను 13 ఏట నుంచే పరిశ్రమలో ఉంది.. ఎంతో కష్టపడుతోంది. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఉంటే.. ఇంత సుదీర్ఘకాలం.. ఇంతటి అద్భుతమైన కెరీర్ ను కొనసాగించగలిగేది కాదు. తాను ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంది. అదే ఆమెను ఇంత దూరం తీసుకు వచ్చింది. తను వర్క్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కుటుంబంలోని ప్రతీ ఒక్కరి బాగోగులు చూసుకుంటోంది. ఈ ఆరోపణల కారణంగా.. నా భార్య ఎంతో డిస్టర్బ్ అయింది. కూతురుపై వచ్చిన అభాండాలు విని ఆమె గుండె బద్దలైపోయింది' అన్నారు దీప్ సింగ్.


 


'ఆయా వ్యక్తులపై ఆరోపణలు చేసేముందు వారికి కుటుంబాలు ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మీడియాపై నాకు గౌరవం ఉంది. కానీ ఆయా వ్యక్తుల పేర్లను ప్రసారం చేసేముందు.. వారి కుటుంబాలను గురించి కూడా ఆలోచించండి. ప్రస్తుతం ఛార్మీ పైసా వసూల్ కి సంబంధించిన పనుల్లో బిజీగా ఉంది' అని చెప్పాడు ఛార్మి డాడీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com