పారిస్: బాలీవుడ్ నటి మల్లికాశెరావత్ అపార్ట్మెంట్ అద్దె కట్టకపోవడంతో దానిని సీజ్ చేసేందుకు ఆదేశాలిచ్చింది ఫ్రెంచి కోర్టు. మల్లిక తన ఫ్రెంచ్ భర్త సిరిల్లే ఆక్సేన్ఫ్యాన్స్ తనకు కట్టాల్సిన 78,787 యూరోలు (రూ.59 లక్షల 98వేలు) అద్దెను చెల్లించలేదని అపార్ట్ మెంట్ యజమాని కోర్టుని ఆశ్రయించాడు. పారిస్ లో మల్లిక కపుల్ నివాసముంటున్న అపార్ట్మెంట్కు నెలకు 6,054 యూరోల (మొత్తం 78,787యూరోలు) చొప్పున చెల్లించాల్సి ఉందని..ఇప్పటివరకు కేవలం 2,715 యూరోలు మాత్రమే చెల్లించారని కోర్టుకు తెలిపాడు. ఈ నేపథ్యంలో దీనిపై విచారించిన కోర్టు మల్లికాశెరావత్ అపార్ట్మెంట్లో ఫర్నిచర్ను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.