మోహన్ బాబు, నిఖిలా విమల్, విష్ణు, శ్రియ ప్రధాన పాత్రలో మదన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోహన్ బాబు, శ్రియలకు సంబంధించిన ఫస్ట్లుక్లను విడుదల చేసిన చిత్రయూనిట్, తాజాగా నిఖిలా విమల్ ఫస్ట్లుక్ రిలీజ్ చేసింది. అందులో నేనీ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే కారణం మా నాన్న అంటూ క్యాప్షన్ను పెట్టారు. దీంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది చిత్ర యూనిట్. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మోహన్బాబు నిర్మిస్తుండగా, థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఫిబ్రవరి 9వ తేదిన ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది.