ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో సారి పవన్ సరసన కీర్తి సురేష్.

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2020, 03:24 PM



పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా, దానిని వెంటనే ఆచరణలో పెట్టడం కోసం దూకుడు మీదే ముందుకు వెళుతుంటాడు. పవన్ మళ్లీ సినిమాలు చేస్తాడా? లేదా ? అనే సందేహంతో అభిమానులు సతమతమవుతుండగా, సినిమాల్లోకి రావాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అంతేకాదు ఒకేసారి ముగ్గురు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'పింక్' రీమేక్ లో చేస్తూనే, క్రిష్ దర్శకత్వంలోను సెట్స్ పైకి వెళ్లనున్నాడు.


చారిత్రక నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. కీర్తి సురేశ్ గతంలో పవన్ సరసన 'అజ్ఞాతవాసి' చేసింది. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడం వలన, ఈ కాంబినేషన్ జనానికి ఎక్కలేదు. పవన్ రీ ఎంట్రీ వేళలో మళ్లీ కీర్తి సురేశ్ ను వెతుకుతూ అవకాశం వెళ్లడం ఆమె అదృష్టమే. ఈ సారి ఈ జోడీ తెరపై ఒక రేంజ్ లో సందడి చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. బందిపోటు దొంగగా పవన్ కనిపించనున్న ఈ సినిమాకి, 'విరూపాక్ష' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com