పవన్ కల్యాణ్ , కీర్తి సురేష్ , అను ఇమ్మానుయేల్ జంటగా త్రివిక్రమ్ దర్శకత్వం లో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అజ్ఞాతవాసి. పవన్ కల్యాణ్ నుండి 25 వ చిత్రం గా రావడం తో గతం లో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ అభిమానుల అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది. కేవలం పవన్ కల్యాణ్ కోసమే సినిమా అనే విధంగా ఉంది తప్ప కథ , కథనం లో కొత్తదనం లేకపోవడం తో సినిమా పెద్దగా నచ్చలేదు. అయినప్పయికి ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని చోట్ల భారీగానే వసూళ్లు చేసినట్లు సమాచారం.తాజాగా నైజాం ఏరియా కు సంబదించిన ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఏరియా కు సంబదించిన రైట్స్ దిల్ రాజు సుమారు రూ. 27 కోట్ల కు కొనుగోలు చేయగా , ఫస్ట్ డే దాదాపు రూ.5.40 కోట్ల షేర్ ను సాధించినట్లు తెలుస్తుంది. ఈ నెల 17 వరకు తెలంగాణ లో రోజుకు 5 షోల అనుమతి ఉండటంతో పండుగ రోజుల్లో కలెక్షన్స్ భారీగా ఉంటాయని భావిస్తున్నారు. మరోపక్క సినిమాకు నెగిటివ్ టాక్ రావడం తో ఆ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయా..అనేది కూడా వినిపిస్తుంది. మరి రాజు కు ఈ చిత్రం లాభాలు తేవడం అటుంచి నష్టాలూ తేకుండా ఉంటుందో లేదో చూడాలి.