అఖిల్ అక్కినేని హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న "సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్". ఈ సినిమా లో సిద్ శ్రీరామ్ పాట పాడబోతున్నాడు అని టాక్. "గీతగోవిందం’ ఆడియోకి వచ్చిన క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. గోపీసుందర్ కంపోజ్ చేసిన ఈ ఆల్బమ్లోని సిద్ శ్రీరామ్ పాడిన రెండు పాటలు చాట్ బస్టర్స్గా నిలిచాయి. ముఖ్యంగా ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాట అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమాలోనూ ఆ మ్యాజిక్ను సిద్ శ్రీరామ్ రిపీట్ చేయబోతున్నారు. గోపీసుందర్, సిద్ శ్రీరామ్ కాంబినేషన్లో వస్తోన్న ఈ ఫస్ట్ సింగిల్ కచ్చితంగా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన అఖిల్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఆల్బమ్ నుంచి తొలిపాటను విడుదల చేస్తున్నారు. ఈ పాట మార్చి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గీతగోవిందం’ సినిమాకి గోపి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’కు కూడా ఆ మ్యూజికల్ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు గోపీ సుందర్. ఆ మధ్య తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఈ మలయాళీ సంగీత దర్శకుడు ఇప్పుడు కాస్త వెనకబడ్డారు. దేవీశ్రీ, తమన్లతో ఈయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. అందుకే, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’కు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారట. ఈ సినిమాతో మళ్లీ ఫామ్లోకి రావాలని చూస్తున్నారాయన. ప్రస్తుతం హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది