హైదరాబాద్ : క్షణం మూవీతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడవి శేష్. ఈ యాక్టర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గూఢచారి’. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్లుక్ రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ నటి శోభితా దూళిపాల (తెలుగమ్మాయి) టాలీవుడ్కు ఎంట్రీ ఇస్తోంది. గూఢచారి సినిమాను తొలిసారిగా ఇద్దరు దర్శకులు కలిసి తెరకెక్కిస్తుండటం విశేషం.