బాలీవుడ్ కింగ్ఖాన్ షారూక్ ఖాన్కు మరో అరుదైన గుర్తింపు లభించనుంది. ఈ నెల 22న దావోస్లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో షారూక్ క్రిస్టల్ అవార్డును అందుకోనున్నారు. హాలీవుడ్ హీరోయిన్ కేట్ బ్లాంచెట్, ప్రముఖ గాయకుడు ఎల్డన్ జాన్తో పాటు ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.
దేశంలో స్త్రీలు, పిల్లల హక్కుల కోసం ఆయన సాగిస్తున్న పోరాటానికే ఈ అవార్డును ఇస్తున్నట్లు వారు తెలిపారు. అయితే యాసిడ్ దాడి, అగ్ని ప్రమాద బాధితులను ఆదుకునేందుకు షారూక్ మీర్ అనే ఫౌండేషన్ను నడుపుతున్నారు. దీని ద్వారా కేన్సర్ బాధిత చిన్నారులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఈ సేవను గుర్తించే అవార్డును ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. ఇదిలా ఉంటే గతంలో ఈ అవార్డును అందుకున్న భారతీయ ప్రముఖులలో అమితాబ్ బచ్చన్, మల్లికా సారాభాయ్, ఏఆర్ రెహమాన్, షబానా ఆజ్మి తదితరులు ఉన్నారు.