కంచె చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన ప్రగ్యా జైస్వాల్..వరుస ఛాన్సులతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె ఆచారి అమెరికా యాత్ర చిత్రంలో నటిస్తుంది. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు. ఈరోజు ఈమె పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ ప్రగ్యా బర్త్డే పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇందులో ప్రగ్యా చాలా గ్లామర్గా కనిపిస్తుంది. ఈ చిత్రం ఈమెకు మంచి ఫలితాన్ని అందిస్తుందని అందరు నమ్ముతున్నారు. పద్మజ పిక్చర్స్ బేనర్ పై కీర్తి చౌదరి నిర్మిస్తున్న ఆచారి అమెరికా యాత్ర చిత్రాన్ని జనవరి 26న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.