సౌత్ లో స్టార్ హీరోలతో పోటీగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ , గుర్తింపు పొందిన నటి నయనతార. తెలుగు , తమిళ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈమె తాజాగా తన అభిమాన నటుడెవరో చెప్పి షాక్ ఇచ్చింది. సాధారణం గా ఏ హీరోయినైనా తన అభిమాన నటుడెవరో చెప్పమంటే చెప్పారు. కానీ నయన్ మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా తన అభిమాన నటుడు అజిత్ అని చెప్పేసింది. కేవలం అజిత్ మాత్రమే కాదు విజయ్ కూడా ఇష్టమే అని తెలిపింది.ప్రస్తుతం లేడీ సూపర్స్టార్గా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ , తాజాగా తెలుగు లో జై సింహ చిత్రం లో బాలయ్య కు జోడిగా నటించి హ్యాట్రిక్ విజయం అందుకుంది. ఇక చిరు నటిస్తున్న సైరా లో కూడా నటిస్తుంది.