కొత్త బంగారు లోకం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్వేతాబసు ప్రసాద్ త్వరలో ఓ కొత్త బాలీవుడ్ సినిమాలో నటించబోతోంది. లాల్ బహదూర్ శాస్త్రి మరణం కథాంశంగా తెరకెక్కబోతున్న 'ద తాష్కెంట్ ఫైల్స్' చిత్రంలో ఈమె నటించబోతోంది. మాజీ ప్రధాని మరణంపై అధ్యయనం చేసే పాత్రికేయురాలు రాగిణి ఫూలే పాత్రలో శ్వేతాబసు ప్రసాద్ కనిపించబోతోంది.
ఇటీవల ఆమె హిందీలో 'చంద్రనందిని' అనే సీరియల్లో, 'బద్రీనాథ్ కీ దుల్హానియా' చిత్రంలో కనిపించింది. ద తాష్కెంట్ ఫైల్స్ చిత్రంలో తాను నటించబోతున్న విషయాన్ని ఇన్స్టాగ్రాం ద్వారా శ్వేతాబసు వెల్లడించింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలు పోషించబోతున్న సంగతి తెలిసిందే.