'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న కన్నడ కస్తూరి రష్మిక మందన్న. కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ'తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ క్రేజ్తోనే తెలుగులోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. 'ఛలో'తో పాటు విజయ్ దేవరకొండ 'గీతాగోవిందం'లోనూ ఈ భామ కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. 'ఛలో'లో నటనకు అవకాశమున్న పాత్రలో కనిపించనున్న రష్మిక.. తన పాత్ర కోసం తనే డబ్బింగ్ చెప్పుకుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. తొలి చిత్రంతోనే డబ్బింగ్ చెప్పుకునే ప్రయత్నం చేసిన ఈ సుందరి.. భవిష్యత్లోనూ డబ్బింగ్ని కొనసాగిస్తుందేమో చూడాలి.