బాలీవుడ్ సినీ నటి ఐశ్వర్య రాయ్ ‘ఫస్ట్లేడీ’ అవార్డును అందుకున్నారు. శనివారం(జనవరి-20) రాత్రి దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ‘ఫస్ట్లేడీస్’ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీ ఇండస్ట్రీలో విజయవంతంగా 20 ఏళ్లు పూర్తిచేసుకున్న మాజీ మిస్ వరల్డ్ ఐష్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ అవార్డును అందజేశారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మొట్టమొదటి మహిళలకు ఈ ఫస్ట్లేడీ అవార్డులు అందజేస్తారు.
ప్రముఖ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైన ఏకైక ఇండియన్ నటి ఐశ్వర్య రాయ్. ఇందుకు గానూ కేంద్ర మంత్రి మేనకా గాంధీ.. ఐష్ను సత్కరించారు. 2002 నుంచి ఐష్ ఏటా ఫ్రాన్స్లో జరిగే కేన్స్ వేడుకకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఐష్ ‘ఫ్యాన్ ఖాన్’ మూవీలో నటిస్తున్నారు.