దర్శకుడు పూరీ జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ ను హీరో రూపొందిస్తున్న మూవీ ‘మెహబూబా. ఇటీవలే ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ చూసిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫిదా అయ్యాడట. ఈ సినిమాను సూపర్ హిట్ మూవీ ‘పోకిరి’తో పోల్చుతూ, ‘మెహబూబా’తో పోల్చితే, ‘పోకిరి’ ఫ్లాప్ అంటూ ట్విట్ చేశాడు.. కుమారుడిపై ప్రేమతో ఎంతో అందంగా సినిమాను పూరీ తెరకెక్కించాడని, ఇదో అందమైన కావ్యమని అన్నాడు వర్మ. ఈ ట్విట్ కు పూరీ పొంగిపోయాడు.. దీనిపై వెంటనే పూరీ రీ ట్విట్ చేస్తూ. “తొలిసారిగా నేను ఓ ఫిల్మ్ మేకర్ నని నా బాస్ అంగీకరించారు. నా జీవితంలో అందిన అతిపెద్ద కాంప్లిమెంట్ ఇదే. లవ్ యూ సర్ అని అన్నాడు..