సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల ఘట్టమనేని తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్, అమైరా దస్తర్, త్రిధా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫీల్ గుడ్ లవ్ స్టొరీతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరిస్తోందని సమాచారం.బుర్రా సాయి మాధవ్ మాటలు, మంజుల స్క్రీన్ ప్లే, రధన్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలువనున్నాయి. ప్రియదర్శి, నాజర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. మంజుల ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా మారినా అనుభవం కలిగిన మేకర్ లా ఈ సినిమాను తియ్యడం విశేషం. ఈ మూవీ తో సందీప్ కిషన్ మంచి విజయం సాధించాలని కోరుకుందాం.