సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ - సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఇంటిలిజెంట్. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోమవారం విడుదలైంది. సాయి ధరమ్ను చాలా సీరియస్గా ఉన్నట్టు ఫస్ట్లుక్లో చూపించారు. సి.కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి చేసుకుంటోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయిందన్నారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. సాయి ధరమ్ పెర్ఫార్మెన్స్, వినాయక్ టేకింగ్ ఈ చిత్రానికి హైలెట్ అన్నారు. సాయి ధరమ్, వినాయక్ కెరీర్లో ఇంటిలిజెంట్ మరో బిగ్గెస్ట్ హిట్ మూవీ అవుతుందన్నారు. తేజు సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తోంది. ఫిబ్రవరి 9న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.