కరోనా వైరస్ పంజా విసురుతుంది. ప్రముఖులు సామాన్యులు అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తుంది. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే లాక్ డౌన్ ఒక్కటే ఇప్పుడున్న ఆశ అని కేంద్రం 21 రోజులు లాక్ డౌన్ ని ప్రకటించింది. తాజాగా కరోనా మహమ్మారి తీవ్రత గురించి దర్శకుడు కొరటాల శివ స్పందించారు. అంతకంతకూ కరోనా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రెండు వారాలు కీలకమని నిపుణులు తెలుపుతున్నారు. మరో రెండు వారాలు ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉండి వైద్యులు, పోలీసులకు సహాయం చేద్దామని కొరటాల తెలియజేశారు.