జార్జియాకు వెళ్లే ముందు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే, షూటింగ్ సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాం. జార్జియా నుంచి భారత్కు రాగానే ఎవరినీ కలవకుండా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయా. లాక్డౌన్కు ముందే తిరిగి వచ్చేయడం మా అదృష్టం. లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్లం”.. అంటూ పూజా హెగ్డే తెలిపింది. అగ్ర హీరోలందరి సరసనా టాప్ హీరోయిన్గా రాణిస్తున్న పూజా హెగ్డే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం జార్జియాలో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి ప్రారంభమవుతున్న దశలో చిత్రబృందం జార్జియా పయనమైంది.ఈ పీరియాడిక్ లవ్ చిత్రం షూటింగ్ ఇటీవలె జార్జియాలో పూర్తయింది. ఆ అనుభవాలను పూజ చెప్పింది…
“సెట్లో ప్రభాస్ చాలా సరదాగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా బాగుంటుంది. ప్రభాస్ ఇంతవరకు కనిపించని స్టైల్తో..బాడీ లాంగ్వేజ్తో ఈ సినిమాలో కనిపించనున్నాడు. ప్రతీ ఫ్రేమ్ ఓ విజువల్ వండర్గా ఉంటుంది. నాకే అలా అనిపిస్తే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారో ఊహించగలను. తర్వాతి షెడ్యూల్లో ప్రభాస్కు, నాకు మధ్య రొమాంటిక్ సీన్స్ను తెరకెక్కించనున్నార”ని పూజ చెప్పింది.