నా సినిమాలో రామ్ చరణ్ ఉంటాడు.. నేను కొరటాల శివ కూర్చుని ఈ పాత్ర గురించి మాట్లాడుకున్నాం.. కానీ చరణ్ నా సినిమా చేయాలంటే రాజమౌళి ఒప్పుకోవాలని మూడు రోజుల ముందు చిరంజీవి చెప్పిన మాట. ఇప్పుడు ఆ పర్మిషన్ వచ్చేసింది. తన సినిమా కోసం రామ్ చరణ్ను నెల రోజుల పాటు రాజమౌళిని అడిగాడు చిరు. దానికి దర్శక ధీరుడు కూడా ఓకే చెప్పేసాడు. దాంతో చిరంజీవి ఆచార్యలో రామ్ చరణ్ నటించడం ఖాయం అయిపోయింది. ఈ పాత్ర ముందు నుంచి కూడా రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని కొరటాల భావించాడని.. అదే వాళ్ల అమ్మ సురేఖ కోరిక కూడా అని చెప్పాడు మెగాస్టార్.ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న చరణ్.. తన సినిమాలో నటించాలంటే రాజమౌళి ఒప్పుకోవాలని చెప్పాడు. ఇప్పుడు ఇదే జరిగింది. దాంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో తనది, చరణ్ది తండ్రీ కొడుకుల బంధం కాదని.. గురు శిష్యులుగా నటిస్తున్నామని చెప్పాడు మెగాస్టార్. దాంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయిప్పుడు. కొరటాల, రాజమౌళి కూర్చుని కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు ఈ మెగా మల్టీస్టారర్ తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడీగా రష్మిక మందన్న నటించబోతుందని ప్రచారం జరుగుతుంది.ఆచార్యలో రామ్ చరణ్ కథను మలుపు తిప్పే పాత్ర చేస్తున్నాడు. ముందు ఈ పాత్రకు మహేష్ బాబును అనుకున్నారనే వార్తలొచ్చినా కూడా అలాంటిదేం లేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. ముందు నుంచి కూడా తమకు రామ్ చరణ్ ఒక్కడే ఈ పాత్రకు ఆప్షన్ అనుకున్నామని చెప్పాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్ కొణిదెల బ్యానర్తో కలిసి కాగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఆచార్య సినిమాను నిర్మిస్తున్నాడు.