సినిమాల్లో విలన్ వేషాలు వేసే సోనూసూద్.. ఇపుడు నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉంది. దీంతో చాలా మంది కార్మికులకు పనిలేకుండా పోయింది. అందులో సినీ కార్మికులు కూడా ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా,పారిశుద్ధ కార్మికులు, జల మండలి, విద్యుత్ వంటి అత్యవసర సేవలు మాత్రం నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. ఈ సందర్బంగా సోనూసూద్.. హెల్త్ వర్కర్స్ కోసం ప్రత్యేకంగా ముంబాయిలోని జుహు ప్రాంతంలో ఒక హోటల్ను ఓపెన్ చేసాడు. అంతేకాదు వారి కోసమే అక్కడ ఉచితంగా భోజనాలు ఏర్పాట్లు చేసాడు. సోనూసూద్ చేసిన పనిని చూసి సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే కరోనా పై పోరాటంలో ఆ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా అందరు తమ వంతు సహకారం అందిస్తున్నారు.ఇప్పటికే అక్కడ అక్షయ్ కుమార్ ఏకంగా రూ. 25 కోట్లు విరాళం ఇచ్చి సంచలనం రేపాడు. మరోవైపు అజయ్ దేవ్గణ్, వరుణ్ ధావన్,అమితాబ్, హృతిక్,విక్కీ కౌశల్ వంటి నటులు తమ వంతుగా సాయం చేసారు. తాజగా సల్మాన్ ఖాన్ కూడా తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు సోనూ సూద్ కూడా తన వంతుగా హెల్త్ కేర్ వర్కర్స్ కోసం హోటల్ ఓపెన్ చేయడం అభినందిచాల్సిన విషయం.