తెలుగు నాట వెండితెరపై హీరోయిన్గా, సైడ్ క్యారెక్టర్స్లో అలా మెరిసి ఇలా వెళ్లిపోయింది. అయితే సినిమాల్లో కంటే బయటి వ్యవహారాలతోనే పూనమ్ కౌర్ ఎక్కువగా ఫేమస్ అయింది. కత్తి మహేష్ చేసిన ఆరోపణలతో పూనమ్ కౌర్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. పవన్ కళ్యాణ్తో రహస్య సంబంధం ఉందని, జల్సా సినిమా విషయంలో గొడవలు కూడా వచ్చాయని ఆయన చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అప్పటి నుంచి పూనమ్ కౌర్ ఏదో ఒక ట్వీట్ చేయడం అది వైరల్ కావడం జరుగుతూనే ఉంటోంది. తాజాగా ఆమె వెబ్సైట్స్పై సెటైర్స్ వేసింది.
పూనమ్ కౌర్ ట్వీట్లలో ద్వంద్వార్థాలుంటాయి. ఏది సూటిగా చెప్పదు. ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేస్తుందో స్పష్టంగా పేర్కొనదు. పూనమ్ చేసే ట్వీట్స్ ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ఆమె వేసే ట్వీట్స్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసినట్టుగా ఉంటాయి.పూనమ్ కౌర్ ఒక్కోసారి ట్వీట్స్ వేసి మళ్లీ డిలీట్ చేస్తూ ఉంటుంది.. లేదా.. తన అకౌంట్ హ్యాక్ అయిందని చెబుతూ ఉంటుంది. పూనమ్ కౌర్ వేసే ట్వీట్స్ ప్రముఖ వార్తలుగా నిలుస్తాయి. ఒక్కోసారి మీడియాపైనా పూనమ్ కౌర్ ఫైర్ అవుతూ ఉంటుంది. పెయిడ్ మీడియా, పెయిడ్ బ్యాచ్, భజన బ్యాచ్ అంటూ సెటైర్స్ వేస్తూ ఉంటుంది.తాజాగా పూనమ్ కౌర్ వరుసగా ట్వీట్స్ వేస్తోంది. ఎన్టీఆర్ జయంతి నాడు నివాళులు అర్పించిన వీడియోను షేర్ చేసింది. అంతకు ముందు పోలీసులకు మాస్కులను అందించింది. దాదాపు వంద మాస్కులను పోలీసులకు అందించడం, గురు గోవింద్ నాద్ పటాన్ని సీసీ సజ్జనార్కు బహూకరించడం తెగ వైరల్ అయింది.పీకే మాస్క్ను పూనమ్ ధరించడంపై శ్రీ రెడ్డి సెటైర్స్ వేసింది. దీనికి ప్రతి స్పందన పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేసింది.‘ఓ కూతురుగా ఉండటం ఒక బాధ్యత, ఒక చెల్లిగా ఉండటం ఒక బాధ్యత, ఒక ప్రేయసి, భార్యగా ఉండటం ఒక బాధ్యత, బాధ్యత ప్రేమతో క్యారెక్టర్తో వస్తది, ఫ్రీడమ్ అని అమ్మ నాన్నని వదిలేసి, డబ్బు అని క్యారెక్టర్ని వదిలేసిన అమ్మాయి ఒక వేశ్య కంటే దారుణం. మనిషిగా మారు మృగం'అని పేర్కొంది.